షూటింగ్ పూర్తి చేసుకున్న దిష్టి బొమ్మ, త్వరలో థియేటర్స్ లో విడుదల !!!


కె.ఎస్.సినిమాస్ బ్యానర్ పై పుండాల ఉమాపతి సమర్పణలో శ్రీ అలిమేముమంగమ్మ ప్రొడక్షన్స్ లో ఆర్.గోపు నిర్మాణంలో రాబోతున్న చిత్రం దిష్టి బొమ్మ. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో , పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మాతలుగా ఉమేష్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి, అమిదాబ్, ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రొపొందించబడింది.
థ్రిల్లింగ్ అంశాలతో కూడిన హర్రర్ సినిమా ఈ దిష్టి బొమ్మ. భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ సినిమాకు ప్రేమ జియం సినిమాటోగ్రఫర్, ఆల్డ్రిన్ ఈ సినిమాకు చక్కటి సంగీతం అందించారు.మార్టిన్ పాల్ సిఎస్ ఈ చిత్రానికి ఎడిటర్.
మంచి కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు ఆర్. గోపు బాలాజీ, హర్రర్ లో ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక సరికొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. త్వరలో ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ విడుదల కానున్నాయి. అలాగే విడుదల తేదీని కూడా యూనిట్ సభ్యులు త్వరలో ప్రకటించబోతున్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.