దీక్ష’ కోసం స్పెషల్ పాటను చిత్రీకరించిన దర్శకుడు డా. ప్రతాని రామక్రిష్ణ గౌడ్

డి ఎస్ రెడ్డి సమర్పణలో ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ నిర్మాణ ,దర్శకత్వంలో
తెరకెక్కుతున్న చిత్రం దీక్ష.
కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక పాటను చిత్రీకరించామని దర్శక, నిర్మాత డాక్టర్ ప్రతాని రామక్రిష్ణ గౌడ్ చెప్పారు. ఈ పాటను మధు ప్రియా పాడారు. ‘ బులెట్’అనే పాటను హీరో కిరణ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ లాస్య, అనూహ్యలపై చిత్రీకరించామని ఆయన అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో గోదారి గట్టుమీద పాటను పాడిన గాయని మధుప్రియ ఇందులో మూడు సినిమాలు పాడారని చెప్పారు. ఈ సినిమాలో పాడీన బుల్లెట్టు అనే పాట సూపర్ సూపర్ హిట్ అవుతుందని తెలిపారు.
‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. అలాగే మైథలాజికల్ ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో కిరణ్ భీముడు పాత్రలో అద్భుతమైన నటన కనపరచాడు. మా చిత్రం ద్వారా హీరో కిరణ్ కి మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆక్స ఖాన్ స్పెషల్ సాంగ్ లో, తనదైన శైలిలో డాన్స్ ఆదరగొట్టింది. మా చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో దీక్షతో పనిచేసారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన 5 పాటలు అందించారు. మధుప్రియ తదితర ముఖ్య గాయనీ గాయకులు తమ స్వరాన్ని అందించారు. ఆర్ ఆర్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రం లో 5ఫైట్స్ ఉన్నాయి. రోహిత్ శర్మను విలన్ క్యారెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తీసుకొస్తుంది. మా బ్యానర్ లో రాబోతున్న 41వ చిత్రమిది. చాలా పట్టుదలతో తీశాం. ప్రేక్షకుల సపోర్ట్ మాకు అందుతుందని భావిస్తున్నాం. దీని తర్వాత ‘కబడ్డీ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ ‘ఆర్కే గౌడ్ ఎంతోమంది కొత్త నటీనటులను ఎంకరేజ్ చేశారు. అందులో నేను కూడా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన డైరెక్షన్లో హీరోగా నటించడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా ప్యాషనేట్గా వర్క్గా చేశారు. ‘దీక్ష’ టైటిల్కు తగ్గట్టే.. అందరూ చాలా కష్టపడ్డారు. అని అన్నారు.
నటి ఆక్సఖాన్ మాట్లాడుతూ ‘‘నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నాకు సపోర్ట్గా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇందులో మంచి పాత్రను పోషించాను. హీరో కిరణ్ గారితో పాటు నా తోటి నటీనటులందరూ బాగా నటించారు. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. మా చిత్రాన్ని ప్రేక్షకులందరు చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను’’ అన్నారు. పి అశోక్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, నిర్మాత, దర్శకత్వం డాక్టర్ ప్రతాని రామక్రిష్ణ గౌడ్.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.


